Allu Arjun | సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిలో త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. తాజాగా ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్లో మరో చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ‘పుష్ప-2’ రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్లో జాయిన్ కాబోతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై యస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ఒకటి ఫిల్మ్సర్కిల్స్లో వినిపిస్తున్నది. పీరియాడిక్ కథాంశంతో దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని, తన గత చిత్రాలకు భిన్నంగా పాన్ ఇండియాకు రీచ్ అయ్యేలా ఈ కథను తీర్చిదిద్దుతున్నారని తెలిసింది. బన్నీకి ఉన్న గ్లోబల్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని ఈ సబ్జెక్ట్ విషయంలో త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెబుతున్నారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషనలో రాబోతున్న ఈ నాలుగో చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.