అగ్ర కథానాయిక త్రిష తమిళ సినీరంగంలో భారీ అవకాశాలతో దూసుకుపోతున్నది. ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం అప్వూర విజయం తో ఈ భామకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కెరీర్ ఆరంభంలో టాప్ హీరోలతో జోడీ కట్టి అనేక కమర్షియల్ విజయాల్ని సొంతం చేసుకు న్న ఈ సొగసరి మరలా ఆ ట్రెండ్ను పునరావృతం చేస్తున్నది. ఇప్పటికే ధనుష్ యా భయ్యవ చిత్రంలో త్రిష నాయికగా ఎంపికైంది. ప్రస్తు తం ‘లియో’ చిత్రంలో విజయ్ సరసన నటిస్తున్నది.
తాజా సమా చారం ప్రకారం ఈ భామ అజిత్ జోడీగా నటించనుంది. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో అజిత్ హీరోగా రూపొందనున్న ‘విడా ము యార్చి’ అనే చిత్రంలో త్రిష కథానాయికగా ఖరారైంది. గతంలో అజిత్-త్రిష కలిసి ఐదు చిత్రాల్లో నటించారు. తమిళనాట సక్సెస్ ఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్న ఈ జంట చాలా కాలం విరామం తర్వాత వెండి తెరపై సందడి చేయబో తుండటం విశేషం. ప్రస్తుతం త్రిష ‘ది రో డ్’ చిత్రంలో నటిస్తున్నది.