Cinema News | 18ఏళ్ల విరామం తర్వాత చిరంజీవితో జతకట్టనున్నారు త్రిష. 2006లో వచ్చిన ‘స్టాలెన్’ తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. కెరీర్ లాంగ్విటీలో వీర్దిదరూ ఎవరితో ఎవరూ తీసిపోరనే చెప్పాలి. ఆ విషయంలో హీరోల్లో చిరంజీవి టాప్లో ఉంటే, హీరోయిన్లలో త్రిష నంబర్వన్ ప్లేస్లో ఉన్నారు. నేటికీ తరగని స్టార్ స్టేటస్ మెగాస్టార్ది అయితే, ఇప్పటికీ తరగని అందం త్రిషది. వీరిద్దరి కలయికకు ‘విశ్వంభర’ వేదికైంది. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో అనుష్క, మృణాల్ఠాకూర్.. ఇలా చాలామంది హీరోయిన్ల పేర్లు వినపడ్డాయి. అన్నిటికీ చెక్ పెడుతూ త్రిషను రంగంలోకి దింపేశారు దర్శకుడు వశిష్ఠ.
యూవీ క్రియేషన్స్తోపాటు చిరంజీవి కుమార్తె సుస్మిత సొంత నిర్మాణ సంస్థ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే మొదలైంది. చిరంజీవి కూడా షూటింగ్లో పాల్గొంటున్నారు. అడ్వంచరస్ సోషియోఫాంటసీ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. వీటికి తోడు త్రిష కూడా ఈ ప్రాజెక్ట్లో భాగం అవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.