Trisha | కథానాయిక త్రిష మెగాస్టార్ చిరంజీవితో మరోసారి జతకట్టనుంది. ‘స్టాలిన్’లో చిరంజీవితో కలిసి నటించిన త్రిష 17 సంవత్సరాల విరామం తరువాత మళ్లీ ఆయనతో కలిసి నటించబోతుంది. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు చిత్రాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెల నిర్మించబోతున్నట్లు సమాచారం.
తండ్రి కొడుకుల కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో చిరంజీవి తండ్రిగా నటిస్తున్నారని, ఈ చిత్రంలో ఆయనకు భార్యగా త్రిషను ఎంపిక చేశారని తెలిసింది. ఇటీవల పొన్నియన్ సెల్వన్’లో తన నటనతో అందరి మెప్పును పొందిన ఈ అందాలతార ప్రస్తుతం విజయ్తో ‘లి’ చిత్రంలో నాయికగా నటిస్తోంది.