‘ప్రస్తుత ఓటీటీ హవాలో ప్రేక్షకుల అభిరుచులు మారాయి. వారిని మెప్పించే సినిమాలు తీయడం దర్శకనిర్మాతలకు సవాలుగా మారింది’ అని అన్నారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ‘లవ్ యూ రామ్’ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి డీవై చౌదరి దర్శకుడు. సీనియర్ దర్శకుడు కె.దశరథ్, డీవై చౌదరి నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ ‘ దశరథ్ మా ఖమ్మం బిడ్డ. తెలుగు సినిమాకు మంచి హిట్స్ అందించాడు. తెలుగులో చిత్ర నిర్మాణం బాగా జరగాలి. థియేటర్, ఓటీటీ ఏ వేదిక అయినా సరే సినిమాలు ఎక్కువగా విడుదలవ్వాలి’ అన్నారు. హరీష్శంకర్ మాట్లాడుతూ ‘దశరథ్ అన్నతో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఆయన రైటింగ్, డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం.
తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగం నిలదొక్కుకోవడానికి తోడ్పాటునందిస్తున్నది. మనిషి జీవితంలో సంపాదించుకోవాల్సిన విలువల గురించి తెలియజెప్పే కథాంశమిది’ అన్నారు. దశరథ్ మాట్లాడుతూ ‘ఫీల్గుడ్ లవ్స్టోరీ ఇది. ప్రతిభావంతులైన సాంకేతిక బృందం సహకారంతో అనుకున్న విధంగా సినిమాను తెరకెక్కించాం’ అన్నారు.