అగ్ర కథానాయిక శృతిహాసన్ చిత్ర సీమలో 13ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేసింది. ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీ నుంచి తప్పుకుందామనుకున్నానని, అభిమానుల ప్రోత్సాహంతో తన ప్రయాణం ఇంతవరకు వచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది.
ఆమె మాట్లాడుతూ ‘ఈ ప్రయాణం నాకు ఎన్నో మధురానుభూతుల్ని మిగిల్చింది. క్రమంగా సినిమా ప్రేమలో పడిపోయా. నాకంటూ సొంతం గుర్తింపును సంపాదించుకొని ఉన్నతస్థానం చేరుకోవడానికి సినీరంగం సహాయపడింది. ఇండస్ట్రీకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. ఈ ప్రయాణంలో నా వెన్నంటి నిలిచిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు’ అని శృతిహాసన్ పేర్కొంది.
తొలుత హిందీ సినిమా ద్వారా వెండితెరపై అరంగేట్రం చేసిన శృతిహాసన్ అనంతరం దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా గుర్తింపుపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘సలార్’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది.