సినీరంగంలో పారితోషికాల ప్రస్తావన మొత్తం హీరోల చుట్టే తిరుగుతుంది. వారితో పోల్చితే కథానాయికలు అందుకునే రెమ్యునరేషన్ చాలా తక్కువ. దక్షిణాదిలో ఎంతో పేరున్న నాయికల పారితోషికం కూడా రెండుమూడు కోట్లకు మించదు. తాజాగా ఈ విషయంలో రికార్డు బ్రేక్ చేసింది అగ్ర కథానాయిక నయనతార. దక్షిణాదిలో పది కోట్ల పారితోషికం అందుకోబోతున్న తొలి హీరోయిన్గా నయనతార చరిత్ర సృష్టించింది.
వివరాల్లోకి వెళితే.. నయనతార నటిస్తున్న 75వ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. నెట్ఫ్లిక్స్ కోసం జీ స్టూడియోస్ సంస్థ రూపొందిస్తున్నది. నీలేష్ కృష్ణ దర్శకుడు. ఈ సినిమాకు ‘లేడీ సూపర్స్టార్ 75’ అనే వర్కింగ్ టైటిల్ను పెట్టారు. మహిళా ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం నయనతార మూడు నెలలు డేట్స్ కేటాయించిందట.
ఓటీటీ మాధ్యమం ద్వారా దేశవ్యాప్తంగా చేరువయ్యే కథాంశం కావడంతో ఈ సినిమాకు నయనతార పదికోట్ల రెమ్యునరేషన్ అందుకోనుందని తెలిసింది. దక్షిణాది కథానాయిక పదికోట్ల పారితోషికం అందుకోవడం తొలిసారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.