Mythri Movie Makers | శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్గా కొనసాగుతోంది మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers). ఈ టాప్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాల్లో ఒకటి రెండు మినహా అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ నిలిచాయి. పుష్ప, రంగస్థలం, పుష్ప 2, వాల్తేరు వీరయ్య లాంటి హిట్స్ అందించిన మైత్రీ మూవీ మేకర్స్ సరికొత్త ముందడుగు వేయబోతుంది. ఇప్పటివరకు సినిమాల నిర్మాణం వరకే పరిమితమైన ఈ టాప్ బ్యానర్ ఇక పంపిణీ రంగంలో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.
ఇప్పటికే సలార్ను విడుదల చేసిన భారీ వసూళ్లను రాబట్టుకుని సక్సెస్ఫుల్గా థియేటర్ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజా అప్డేట్ ఏంటంటే.. మైత్రీ మూవీ మేకర్స్ సెవెన్ స్క్రీన్ మల్టీప్లెక్స్, మైత్రీ సినిమాస్ (Mythri Cinemas) నేడు గుంటూరులో లాంఛ్ కానుంది. గుంటూరులోని కాస్లీ ఏరియాలో నయా షాపింగ్మాల్లో మైత్రీ సినిమాస్ అందుబాటులో ఉండనుంది. మైత్రీ సినిమాస్ టిల్లు 2ను విడుదల చేయనుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఓ ఈవెంట్ను కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా సినిమాల నిర్మాణంతో కాసులు సంపాదించిన మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా రాణించాలన్నారు ఆకాంక్షిస్తున్నారు మూవీ లవర్స్.