నూతనతారలు టోని కిక్, సునీత మారస్యార్ జంటగా ఓ చిత్రం హైదరాబాద్లో లాంచనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కథారచయిత చిన్నికృష్ణ క్లాప్ కొట్టగా, ఏఐ ఫ్లెక్స్ ప్రదీప్కుమార్ కెమెరా స్విచాన్ చేశారు. రచయిత వెలిగొండ శ్రీనివాస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిథులందరూ చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు అందించారు.
చిత్ర నిర్మాత గిరీశ్కుమార్ మాట్లాడుతూ ‘మా ఏ3 లేబుల్స్ బ్యానర్లో ఇదే తొలి సినిమా. ఇక ముందు కూడా మంచి సినిమాలే చేస్తాం’ అని నమ్మకం వ్యక్తం చేశారు. చిత్ర దర్శకుడు బుల్లెట్ బండి లక్ష్మణ్ మాట్లాడుతూ ‘దర్శకుడ్ని కావడం నా కల. నా కలను గుర్తించి అవకాశం ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు. ఇన్నాళ్లూ నాలుగు నిమిషాల పాటలో కథను చెప్పేవాడ్ని. ఇప్పుడు రెండు గంటల సినిమాతో చెప్పబోతున్నా. నన్ను యూట్యూబ్లో ఆదరించినట్టే, దర్శకుడిగా కూడా ఆదరిస్తారని నమక్మకంతో ఉన్నాను’ అన్నారు. ఇంకా చిత్ర యూనిట్సభ్యలందరూ మాట్లాడారు.