మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదలై ఫ్లాప్ టాక్ను తెచ్చుకుంది. కొరటాల మార్కు ఈ చిత్రంలో కనిపించలేదని, అసలు ఈ చిత్రాన్ని కొరటాల శివనే దర్శకత్వం వహించాడా, ఆయన డైలాగ్స్, ఎలివేషన్స్ ఏ మాత్రం సినిమాలో కనిపించలేదని అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం కూడా మైనస్ అని ప్రేక్షకుల అభిప్రాయం. రెండు మూడు పాటలు మాత్రమే ఆకట్టుకున్నాయని తెలిపారు. కాగా తాజాగా ఈ చిత్రంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
ఈ చిత్రాన్ని పరుచూరి రీసెంట్గా చూశానని అందుకే ఇప్పుడు ఆచార్య గురించి మాట్లాడుతున్నానని తెలిపాడు. ఈ చిత్రాన్ని చూసేటప్పుడు ఎన్నో ఏళ్ళ క్రీతమే మేము రాసిన ‘మరో మలుపు’ అనే చిత్రం తమకు గుర్తుకు వస్తోందని తెలిపాడు. ఈ చిత్రంలో కూడా ఆలయాల దోపిడి నక్సలైట్గా శివకృష్ణ నటించాడని, ఇక ఆచార్య చిత్రంలో కూడా పాదఘట్టం, ధర్మస్థలి జీవనధార సాక్షీగా ఈ సినిమా కథ నడుస్తుంది. 1990ల్లో ఎక్కువగా నక్సలిజం సినిమాలు వచ్చాయని ఇప్పుడు ఇలాంటి కథలను రాయడం పూర్తిగా మానేశామని తెలిపాడు. చాలా ఏళ్ళ తర్వాత కొరటాల ఇలాంటి సినిమా తెరకెక్కించడం చాలా గొప్ప విషయమని తెలిపాడు.
అయితే ఈ సినిమా తెరకెక్కించేటప్పుడు ఎందుకు జరిగింది? ఏం జరిగింది? అనే విషయాన్ని తెలియకుండానే కథను చూపించారు. దీంతో ప్రేక్షకులు అయోమయంలో పడ్డారు. ఆ ప్రభావం సినిమా పైన చాలా పడింది. అందువల్లే ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది అని తెలిపారు. ఇక రామ్చరణ్ పాత్రను మొదటి భాగంలో అక్కడక్కడ చూపించి ఉంటే బాగుండేది, కానీ సెకండ్ హాఫ్ వరకు దాచేయడం వలన ఈ సినిమా సరిగ్గా ప్రేక్షకులకు ఎక్కలేదు. ఈ చిత్రంలో రామ్చరణ్ నటించకపోయుంటే బాగుండేదని తెలిపాడు. ఒక పనిచేయడానికి ఇద్దరు స్టార్లు అవసరం లేదని తన అభిప్రాయం అని పరుచూరి తెలిపాడు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ వారికి నక్సలైట్ కి సంబంధించిన సినిమాలు ఎక్కడం లేదు. దీనవల్లే ఈ సినిమా ప్లాప్ కి కారణమని చెప్పవచ్చు అని తెలిపాడు.