సుమారు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చాడు టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్ (Meher Ramesh). ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించి టాక్ ఆఫ్ ది టౌన్గా మారాడు. ప్రస్తుతం భోళా శంకర్ (Bholaa Shankar)తో బిజీగా ఉన్న మెహర్రమేశ్ వీకెండ్ బ్రేక్ తీసుకున్నాడు. ఆదివారం ఉదయం తనకిష్టమైన బైకు రైడ్ () చేశాడు. హైదరాబాద్ రోడ్లపై బైకు రైడు వీకెండ్ అడ్వెంచర్ను ఎంజాయ్ చేశాడు. హార్లీ డేవిడ్ సన్ బైకుపై జొర్రో హస్కీ (పెంపుడు కుక్క) పట్టుకుని చక్కర్లు కొట్టాడు.
సిటీలో రైడ్ కు వెళ్తున్నపుడు పక్కనే ఉన్న మరో వ్యక్తి మెహర్ రమేశ్ ను ఫొటోలు తీశాడు. ఈ స్టిల్స్ ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా..నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన వేదాళమ్ చిత్రాన్ని భోళా శంకర్గారీమేక్ చేస్తున్నాడు చిరంజీవి. ఈ చిత్రంలో చిరంజీవి సోదరిగా కోలీవుడ్ హీరోయిన్ కీర్తిసురేశ్ నటిస్తోంది. 2013లో వెంకటేశ్ హీరోగా వచ్చిన షాడో చిత్రాన్ని చివరిసారిగా డైరెక్ట్ చేశాడు మెహర్ రమేశ్.
ఈ సినిమా బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని కసిగా ఎదురుచూస్తున్నాడు.