Dua Lipa | పాప్ స్టార్ దువా లిపా (Dua Lipa)కు వరల్డ్ వైడ్గా ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ లండన్ భామ ముంబై కన్సర్ట్ కోసం ఇండియాలో సందడి చేసింది. దువా లిపా ఇండియాలో చేస్తున్న రెండో కన్సర్ట్కు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
కాగా ఈవెంట్లో టాలీవుడ్ నుంచి నమ్రతా శిరోద్కర్తోపాటు పలువురు సెలబ్రిటీల కూతుళ్లకు దువా లిపాను కలిసే అరుదైన అవకాశం వచ్చింది. మహేశ్ బాబు కూతురు సితార, వంశీపైడి పల్లి, సుకుమార్ కూతుళ్లు సుకృతి, ఆద్యలు ఈవెంట్ సందర్భంగా దువా లిపాతో కలిసి సెల్ఫీ, ఫొటోలు దిగారు. ఈ ముగ్గురూ పాప్ స్టార్ను కలిసిన ఆనందంలో ఎగిరిగంతేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, అనంత్ అంబానీ భార్య రాధికా మర్చంట్, ఇషా అంబానీ భర్త ఆనంద్ పిరమల్తోపాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. దువా లిపా 2019లో నవీ ముంబైలో వన్ ప్లస్ మ్యూజిక్ ఫెస్టివల్తో తొలిసారి ఇండియాలో సందడి చేసింది.
Mahesh Babu’s daughter Sitara shared some pictures with music sensation Dua Lipa after her concert in mumbai 🎶😍🔥! #buzzzooka_events #dualipa #maheshbabu #sitaraghattamaneni #celebrity pic.twitter.com/VdeIV7Tyuo
— Buzzzooka Events (@BuzzzookaEvents) December 2, 2024
Ram Gopal Varma | అప్పటిదాకా నో అరెస్ట్.. రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట
Harish Shankar | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. షోలే డైరెక్టర్తో హరీష్ శంకర్