Naresh | తమపై సోషల్ మీడియాలో జరుగుతోన్న ట్రోలింగ్ను ఆపాలని కోరుతూ సినీ నటులు నరేశ్-పవిత్రా లోకేశ్ (Pavitra Lokesh)పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. యూట్యూబ్ ఛానళ్లలో మార్ఫింగ్ ఫొటోలు, అసభ్య పదజాలంతో తమను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరగా.. పలు యూ ట్యూబ్ ఛానళ్లకు నోటీసులు కూడా జారీ చేశారు.
తాజాగా ఈ వ్యవహారంలో నరేశ్ (Naresh) మరోసారి నాంపల్లి కోర్టు (Nampally Court) ను ఆశ్రయించారు. తమ వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేస్తూ పరువు ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని తమపై ట్రోలింగ్ చేస్తున్న పలు యూట్యూబ్ ఛానెళ్లు, వ్యక్తులపై నరేశ్ క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు పవిత్రా లోకేశ్, నరేశ్లపై ట్రోలింగ్కు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానెళ్లకు నోటీసులు ఇచ్చి.. 12 మంది (ఫిర్యాదులో పేర్కొన్న పేర్లు)పై విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించింది.
గత కొంతకాలంగా పవిత్రాలోకేశ్-నరేశ్ డేటింగ్లో ఉన్నారంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు కూడా హల్ చల్ చేస్తు్న్నాయి. ఈ నేపథ్యంలో పవిత్రాలోకేశ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.