అమన్, సిద్ధికా శర్మ జంటగా నటిస్తున్న సినిమా ‘నిన్నే పెళ్లాడతా’. ఈ చిత్రాన్ని ఈశ్వరీ ఆర్ట్స్, అంబికా ఆర్ట్స్ పతాకాలపై వెలుగోడు శ్రీధర్ బాబు, బొల్లినేని రాజశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైకుంఠ బోను దర్శకత్వం వహిస్తున్నారు. తుది హంగుల్లో ఉన్న ఈ సినిమా ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…‘ఈ సినిమా పేరు చెప్పగానే నాగార్జున గారు గుర్తొస్తారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ను విడుదల చేయడం ద్వారా ఆయన విషెస్ మాకు దక్కాయి. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. యూత్తో పాటు కుటుంబ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది. గ్రాండ్గా మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. మా చిత్ర ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చిందని. థియేటర్లలోనూ ఇదే ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నామని హీరో అమన్ అన్నారు.