రాజ్తరుణ్, మాల్వి మల్హోత్రా జంటగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడరసామీ’. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకుడు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నారు. ‘జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ భాగం చిత్రీకరణ జరిపాం. యువతను మెప్పించే ప్రేమకథ, ఫ్యామిలీస్ను ఆకట్టుకునే సెంటిమెంట్, మాస్ మెచ్చే యాక్షన్ అంశాలతో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాం.
తన లక్ష్యం కోసం ఎంతటివారినైనా ఎదిరించే ఓ యువకుడి కథ ఇది. యాక్షన్ ఘట్టాలు హైలైట్గా నిలుస్తాయి. టీజర్కు అద్భుతమైన స్పందన లభించింది. ఫిబ్రవరి మొదటివారంలో విడుదల చేస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. మన్నారా చోప్రా, మకరంద్ దేశ్పాండే, రఘుబాబు, జాన్ విజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జవహర్ రెడ్డి, సంగీతం: జేబీ, రచన-దర్శకత్వం: ఏఎస్ రవికుమార్ చౌదరి.