మాస్ మహరాజా రవితేజ వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. ఆయన నటించిన ఖిలాడి చిత్రం విడుదలకి సిద్ధంగా ఉండగా, రామారావు అన్ డ్యూట్, ధమాకా సెట్స్పై ఉన్నాయి.సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.ఇక తన 71వ సినిమాగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కథ పలువురు స్టార్స్ దగ్గరకు వెళ్లి చివరికి రవితేజ దగ్గరకు వచ్చింది.
వంశీ దర్శకత్వంలో రవితేజ నటించనున్న కొత్త చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.తాజాగా విడుదలైన ప్రీ లుక్ పోస్టర్లో రెండు కాళ్ళ సజెషన్ లో కదులుతున్న ట్రైన్ ను పోస్టర్ గా విడుదల చేశారు మేకర్స్. వేటాడేముందు నిశ్శబ్దాన్ని ఫీలవ్వండి అంటూ ఓ కేప్షన్ ను కూడా పోస్టర్ పై మెన్షన్ చేశారు.
స్టువర్టుపురం దొంగల ముఠాలో నాగేశ్వరరావు ఒకడు. అతని తెగింపునకు గుర్తుగా ‘టైగర్’ పేరుతో పిలిచేవారు. 1970 దశకంలో అధికారులకు నాగేశ్వరరావు ముచ్చెమటలు పట్టించాడు 1987లో పోలీసులు అతడిని మట్టుబెట్టారు. ఇప్పుడు ఆయన బయోపిక్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.