హర్ష నర్రా, నిఖిషా రంగ్వాలా, మిషా నారంగ్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘మిస్సింగ్’. భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరిరావు నిర్మిస్తున్నారు. శ్రీని జోస్యుల దర్శకుడు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. నగరంలో కొంతమంది యువతీయువకులు అనూహ్యంగా అదృశ్యమైపోతుంటారు. ఆ మిస్సింగ్స్ వెనకున్న రహస్యాన్ని ఓ యువకుడు ఎలా ఛేదించాడన్నది ఉత్కంఠను పంచుతుంది. ప్రస్తుతం నాయకానాయికలపై ప్రమోషనల్ సాంగ్ను చిత్రీకరిస్తున్నాం. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. కథాబలమున్న మంచి సినిమాలో నటిస్తుండటం ఆనందంగా ఉందని హీరోహీరోయిన్లు చెప్పారు.