Cinema News | వేదిక లీడ్రోల్లో నటిస్తున్న థ్రిల్లర్ చిత్రం ‘ఫియర్’. హరిత గోగినేని దర్శకత్వంలో ఏఆర్ అభి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. షూటింగ్ ప్రారంభించుకుని సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేశామని, డైరెక్టర్గా తొలి సినిమా అయినా క్లారిటీగా హరిత ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, వేదికతోపాటు మిగతా ఆర్టీస్టులందరూ సహకరించడం వల్లే ఇంత త్వరగా సినిమా పూర్తి చేయగలిగామని, నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా త్వరలోనే పూర్తి చేసి థియేటర్లలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.
అరవింద్కృష్ణ, జె.పి, పవిత్రలోకేశ్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్యకృష్ణ, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఐ ఆండ్రూ, సంగీతం: అనూప్ రూబెన్స్, సహనిర్మాతలు: సుజాతరెడ్డి, సామ సురేందర్రెడ్డి, నిర్మాణం: దత్తాత్రేయ మీడియా.