తెలుగు తెరపై ఇప్పుడిప్పుడే నిలదొకుకుంటున్న తెలంగాణ నటుడు తిరువీర్. ఈ యువకుడు ‘జార్జ్ రెడ్డి’, ‘పలాస’, ‘మల్లేశం’, ‘మసూద’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. వెబ్ సిరీస్లోనూ మంచి ఆదరణ సంపాదించాడు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తన మనసులోని భావాలను పంచుకుంటున్నాడు.. తిరువీర్.
షాద్నగర్ దగ్గర మామిడిపల్లి మా ఊరు. నాన్న వ్యవసాయం చేసేవారు. ఆర్థిక ఇబ్బందులతో మా కుటుంబం హైదరాబాద్ వలస వచ్చింది. కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండేవాళ్లం. నేను మైలార్ దేవ్పల్లి, రాజేంద్రనగర్లో చదువుకున్నా. సిటీ కాలేజ్లో డిగ్రీ చేస్తున్నప్పుడు ఏదైనా కొత్త కెరీర్ ఎంచుకోవాలి అనిపించింది. మా కాలేజీ ఆవరణలో తరచూ షూటింగ్స్ జరిగేవి. అది చూశాక సినిమాలు కూడా ఒక పనే కదా అనే ఉద్దేశంతో అటువైపు దృష్టిపెట్టాను. కొంతకాలం అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. చిన్నచిన్న పాత్రల్లో నటించాను. ఆసు యంత్రం ఆవిష్కర్త పేరు మీద తీసిన ‘మల్లేశం’ సినిమా నా జీవితంలో ఓ మలుపు. ఇదే కాదు నేను చేసిన అనేక చిత్రాల్లో తెలంగాణ నేపథ్యం ఉంటుంది. ఇది నా అదృష్టం. తెలంగాణ
యాస పాయసమంత కమ్మనైంది.
ఇటీవలికాలంలో తెలంగాణ దర్శకులు సత్తా చాటుతున్నారు. తమవైన స్థానిక కథలను తెరకెకిస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో నిర్మాతలను ఒప్పిస్తున్నారు. ప్రత్యేకించి మన యాసలో మాట్లాడే నటీనటులనే ఎంచుకుంటున్నారు. స్థానిక లొకేషన్స్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. పోచంపల్లి, వికారాబాద్, పరిగి తదితర ప్రాంతాల్లో షూటింగ్స్ ఎకువగా జరుగుతున్నాయి. ఇదొక మంచి మార్పు. మన యాసలో వస్తున్న పాటలకు మంచి ఆదరణ లభిస్తున్నది. మంగ్లీ జానపదాలు, భీమ్స్ ట్యూన్స్ సూపర్ హిట్ అవుతున్నాయి. తెలంగాణ కళాకారులకు ప్రభుత్వం సహకారం అందిస్తున్నది. మామిడి హరికృష్ణ గారి ఆధ్వర్యంలోని భాషా సాంస్కృతిక శాఖ నాటకాలనే కాకుండా ఒగ్గు కథ, డోలు వాయిద్యం, కూచిపూడి మొదలైన వాటినీ ప్రోత్సహిస్తున్నది. యూ ట్యూబ్ చానల్స్ ద్వారా కూడా తెలంగాణ కళాకారులకు గుర్తింపు దకుతున్నది. చాలామంది హీరోయిన్ల కంటే గంగవ్వే పాపులర్ ఇప్పుడు.
పాలమూరు పచ్చబడింది మా జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం. తెలంగాణ రాక ముందు నీళ్ల బిందెలు మోసుకుని కిలోమీటర్ల దూరం నడిచేవాళ్లం. లేదంటే, సైకిల్కు రెండు వైపులా బిందెలు కట్టి ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకునే వాళ్లం. మా బావ పన్నెండు బోర్లు వేసి చుక్క నీళ్లు కూడా పడక తీవ్రంగా నష్టపోయాడు. ఇవాళ కాలువల ద్వారా నీళ్లు వస్తున్నాయి. వాటిని బావులకు మలుపుకుంటున్నారు. బావుల్లో నీరు ఊరుతున్నది. చెరువులు పొంగి పొర్లుతున్నాయి. వరి పండుతున్నది. ఈ అభివృద్ధిని చూస్తుంటే సంతోషంగా అనిపిస్తున్నది.
…? రమేష్ గోపిశెట్టి