‘నిర్మాతగా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సరైన టీమ్ కుదరడం వల్లే ఈ సినిమాను తక్కువ బడ్జెట్లో పూర్తి చేయగలిగాం. కొత్త ప్రతిభను పరిచయం చేయాలనే మా ప్రయత్నం సఫలమైనందుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ నెల 15 నుంచి ‘ఆహా’లో సినిమా స్ట్రీమింగ్ కానున్నది’ అని కిరణ్ అబ్బవరం అన్నారు.
కొత్తవారిని పరిచయం చేస్తూ, సమైర స్టూడియోస్తో కలిసి ఏకే ప్రొడక్షన్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం నిర్మించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సాయితేజ్, వేద జలంధర్ జంటగా నటించారు. వి.మునిరాజు దర్శకుడు. గత నెలలో థియేటర్లలో విడుదలైంది. ఈ నెల 15న ఓటీటీ ప్లాట్ఫాం ఆహాలో స్ట్రీమింగ్ కానున్నది. ఈ సందర్భంగా ‘తిమ్మరాజుపల్లి టీవీ సంబరాలు’ పేరిట హైదరాబాద్లో గురువారం నిర్వహించిన ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడారు.