నాలుగు నెలల తర్వాత థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాల సందడి మొదలైంది. మరీ క్రౌడ్ పుల్లింగ్ సినిమాలు కావు.. అలా అని తీసిపారేసే సినిమాలు కూడా కాదు. కాస్త గుర్తింపు ఉన్న హీరోలు నటించిన సినిమాలు ఈ వారం థియేటర్స్లోకి వచ్చాయి. కంటెంట్ ఉన్న సినిమాలతో దూసుకెళ్తున్న సత్యదేవ్ తొలిసారి లాయర్ పాత్రలో నటించిన చిత్రం తిమ్మరుసు. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. అలాగే జాంబీ రెడ్డి సినిమాతో సోలో హీరోగా హిట్ కొట్టిన తేజ ఇష్క్ ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ రెండు సినిమాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అన్ని కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సినిమాలను ప్రదర్శిస్తున్నారు ఎగ్జిబిటర్లు.
ఇదిలా ఉంటే చాలా గ్యాప్ తర్వాత సినిమా హాల్స్ ఓపెన్ కావడంతో.. థియేటర్లకు ఎంతమంది జనం వచ్చారో తెలుసుకునేందుకు అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. దీనికి సమాధానం మాత్రం నిర్మాతలు జీర్ణించుకోలేని విధంగానే ఉంది. ఎందుకంటే కేవలం హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వంటి మెయిన్ సిటీస్లో మాత్రమే థియేటర్లకు జనం వచ్చారు. అది కూడా మల్టీప్లెక్స్ల్లో 50 శాతం టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఇక చిన్న చిన్న పట్టణాలు, ఊళ్లలో కనీసం 20 శాతం సీట్లు కూడా నిండలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న సినిమాలు కావడంతో ప్రేక్షకులు థియేటర్ల వరకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అదే పెద్ద సినిమాలు విడుదల అయితే తప్ప థియేటర్ల వరకు జనం వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే ఈ శుక్రవారం విడుదలైన తిమ్మరుసు సినిమాకు మంచి టాక్ వచ్చింది. అయితే వీకెండ్లో వచ్చే కలెక్షన్లను బట్టి వచ్చే వారం సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక అంచనా వేయొచ్చు అంటున్నారు ట్రేడ్ పండితులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Sumanth Malli Modalaindi | సుమంత్ ‘మళ్లీ మొదలైంది’ ఫస్ట్ లుక్
Review : తిమ్మరుసు సినిమా ఎలా ఉందంటే..
రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుమంత్.. దేవుడు, దెయ్యాలకు థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు