వరుణ్తేజ్ కథానాయకుడిగా ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘మట్కా’ రెగ్యులర్ షూటింగ్ గురువారం మొదలైంది. వైర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయేందర్ రెడ్డి తీగల, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘యావత్ దేశాన్ని కదిలించిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. 1958-1962 కాలం మధ్యలో కథ నడుస్తుంది.
వరుణ్తేజ్ నాలుగు భిన్నమైన గెటప్స్లో కనిపిస్తారు. హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో 50, 80ల నాటి వాతావరణాన్ని రీక్రియేట్ చేశాం’ అన్నారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, నవీన్చంద్ర, కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఏ.కిషోర్ కుమార్, సంగీతం: జీవీ ప్రకాష్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్.