హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ (‘Vyuham’ Movie ) సినిమా విడుదలపై నిర్మాత దాసరి కిరణ్ కుమార్కు తెలంగాణ హైకోర్టు Telangana High Court ) లో చుక్కెదురయ్యింది. డిసెంబర్ చివరి వారంలో సినిమా విడుదలపై సింగిల్ బెంచ్ కేసును జనవరి 11కు వాయిదా వేసింది.
దీంతో తీర్పును సవాల్ చేస్తూ నిర్మాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. సినిమా సకాలంలో విడుదల కాకపోవడం వల్ల కోట్లల్లో నష్టం వచ్చిందని నిర్మాత తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. స్పందించిన హైకోర్టు సింగిల్ బెంచ్లోనే తేల్చుకోవాలని పిటిషనర్కు స్పష్టం చేయడంతో సినిమా విడుదలపై ప్రతిష్టంభన కొనసాగుతుంది.
రాజకీయంగా తమను కించపరిచే విధంగా, తమ ప్రతిష్టతకు భంగం కలిగించే విధంగా ‘వ్యూహం సినిమాను తీశారని ఆరోపిస్తూ ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వవద్దని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. వాస్తవానికి నవంబర్ 10న సినిమా విడుదల కావాల్సి ఉండగా ఆయన ఫిర్యాదుతో సెన్సార్ సర్టిఫికేట్ను నిలిపివేశారు.
అనంతరం సెన్సార్ సర్టిఫికేట్ రావడంతో డిసెంబర్ 29న సినిమా విడుదలకు నిర్ణయించారు. మరోసారి నారా లోకేష్ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసి తదుపరి కేసు విచారణను జనవరి 11వ తేదీకి వాయిదా వేయడంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది .