Sudipto Sen | ఇటీవల విడుదలైన వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) దర్శకుడు సుదీప్తో సేన్ (Sudipto Sen) అస్వస్థతకు గురయ్యారు. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా విరామం లేకుండా వరుస ప్రయాణాల కారణంగా అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఆయన్ని ముంబై (Mumbai) లోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రి ( Dhirubhai Ambani Hospital )లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు తన ఆరోగ్య పరిస్థితిపై దర్శకుడు స్పందించారు. డీహైడ్రెషన్ (Dehydration) , ఇన్ఫెక్షన్ (Infection) సమస్యలతో కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. ప్రస్తుతం అంతా అదుపులో ఉందన్నారు. ఈరోజు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇంటికి పంపమని వైద్యులను కోరనున్నట్లు సుదీప్తో సేన్ తెలిపారు.
విడుదలకు ముందు నుంచే రాజకీయంగా తీవ్ర వివాదం రేగిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). సుదీప్తో సేన్ (Sudipto Sen) తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఆదా శర్మ (Adah Sharma) హీరోయిన్గా నటించింది. హిజాబ్, లవ్ జిహాద్ ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లవ్ జిహాద్ ద్వారా కేరళకు చెందిన 32 వేల మందిని ముస్లిం మతంలోకి మార్చి, సిరియాకు తరలించారనే ఆరోపణలపై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంపై కేరళ సహా పలు రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తప్పుడు వాదనల ద్వారా సమాజంలో వర్గ విభేదాలు సృష్టించే లక్ష్యంతోనే ఈ చిత్రాన్ని నిర్మించారంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎన్ని వివాదాలు చుట్టుముట్టినప్పటికీ ఈ వివాదాస్పద చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుండటం గమనార్హం. మే 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పటి వరకు సుమారు రూ.200 కోట్ల మేర వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది.
Also Read..
Long Covid | ఒమిక్రాన్తో ప్రతీ 10 మందిలో ఒకరికి లాంగ్ కొవిడ్.. లక్షణాలు ఏంటంటే..?
Baba Ramdev | రెజ్లర్లకు బాబా రాందేవ్ మద్దతు.. బ్రిజ్ భూషణ్ను జైల్లో పెట్టాలని డిమాండ్