వరుణ్ సందేశ్ కథానాయకుడిగా ధన్రాజ్, కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో ఆర్ఎన్ హర్షవర్థన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘చిత్రం చూడర’. శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మి నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ని గురువారం విడుదల చేశారు. ఇందులో వరుణ్ సందేశ్, ధన్రాజ్, కాశీ విశ్వనాథ్ పోలీసుల విచారణలో ఉన్నట్లు కనిపిస్తున్నారు.
ఈ ఫస్ట్లుక్ పోస్టర్ అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్నది. అల్లరి రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రథన్, సహ నిర్మాత: ధన తుమ్మల.