కన్నడ కస్తూరి రష్మిక మందన్న కెరీర్లో మహర్దశ నడుస్తున్నది. ఈ భామ పట్టిందల్లా బంగారమవుతున్నది. ఇప్పటికే దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ హిందీలో ‘మిషన్ మజ్ను’ ‘గుడ్బై’ చిత్రాల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నది. అయితే ‘పుష్ప’ సినిమా అపూర్వ విజయంతో ఈ సొగసరి పేరు ఉత్తరాదిన మార్మోగుతున్నది. ఈ సినిమాలో శ్రీవల్లి అనే పల్లెటూరి అమ్మాయిగా అందం, అమాయకత్వం కలబోసిన పాత్రలో ఈ అమ్మడు యువతరం హృదయాల్ని దోచుకుంది. ‘నా సామి..’ అంటూ ఈ భామ వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. ‘పుష్ప’ సినిమా తెచ్చిన గుర్తింపుతో రష్మిక ఎక్కడికి వెళ్లినా శ్రీవల్లి అనే పిలుస్తున్నారట. ఇటీవల కుటుంబ సభ్యులతో హాలీడేట్రిప్ను ముగించుకొని ముంబయి ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన ఆమెకు ఎదురుపడిన వారంతా శ్రీవల్లి అంటూ పలకరించారట. ఫొటో లు, సెల్ఫీల కోసం పోటీపడ్డారట. శ్రీవల్లి పాత్ర పేరుతో అభిమానులు తనను పిలవడం చాలా ఆనందంగా ఉందని, కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర ఇదని రష్మిక మందన్న ఆనందం వ్యక్తం చేసింది.