కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలువురు హీరోలకు సంబంధించిన సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. అక్కినేని హీరో నాగ చైతన్య థాంక్యూ మాత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల వైజాగ్లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం రీసెంట్గా ఇటలీకి వెళ్లింది. పాండమిక్ పరిస్థితుల్లోను ‘థ్యాంక్యూ’ చిత్ర యూనిట్ ఇటలీలో ల్యాండ్ అయ్యారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ చిత్రీకరణ జరుపుతున్నారు.
చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా పని చేస్తున్న పీసీ శ్రీరామ్ లొకేషన్స్ స్టిల్స్ తన ట్విట్టర్లో షేర్ చేస్తూ..పాండమిమక్ టైంలో జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నాం అని పేర్కొన్నారు. 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండనుండగా, రాశీ ఖన్నా కూడా ఈ షెడ్యూల్లో పాల్గొననుంది . ‘థ్యాంక్యూ’ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి లు కలిసి నిర్మిస్తున్నారు. బీవీఎస్ రవి ఈ సినిమాకి స్టోరీ అందించడంతో పాటు డైలాగ్స్ కూడా రాస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. చిత్రంలో మహేష్ అభిమానిగా చైతూ కనిపించనున్నారు.