అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కుమార్ దర్శకడు. ‘మనం’ లాంటి బ్లాక్బస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రమిదే కావడం విశేషం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాతలు దిల్రాజు, శిరీష్ తెరకెక్కిస్తున్నారు. రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. టీజర్తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం నుంచి ‘ఏంటో.. ఏంటేంటో.. నాలో ఏంటేంటో.. నాతో నువ్వేంటో..నీతో నేనెంటో.. చూసే చూపేంటో..మారే తీరేంటో.. వెళ్లే దారేంటో.. జరిగే మాయేంటో’ అంటూ కొనసాగే మ్యాజికల్ మెలోడి లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు. హృద్యమైన ప్రేమభావనలకు అద్దం పడుతూ బ్యూటిఫుల్ మెలోడీగా సాగిందీ గీతం. ఈ పాటకు ప్రముఖ గీత రచయిత అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, జోనిత గాంధీ ఆలపించారు. తమన్ స్వరాలను అందించారు. లెజండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథను అందించారు.