Thalapathy Vijay | తమిళ అగ్ర హీరో విజయ్ వాళ్ల అమ్మకోసం ఆలయం కట్టారు. ఈ విషయం తమిళనాడు మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీనిపై విజయ్ తల్లి శోభ తాజాగా స్పందించారు. ‘అవును.. నా కొడుకు విజయ్ నాకోసం గుడికట్టాడు. నేను సాయి భక్తురాలిని. నాకెప్పట్నుంచో సాయిబాబా గుడి కట్టాలనే కోరిక ఉండేది. వాడితో చాలాసార్లు ఆ విషయం చెప్పాను కూడా.
నా కోరికను అర్థం చేసుకుని ఇన్నాళ్లకు నాకోసం సాయిబాబా ఆలయం కట్టాడు. నా కొడుకు నాకోసం కట్టిన ఈ సాయి ఆలయానికి వచ్చి బాబాను దర్శించుకుంటే నాకేదో తెలియని ఆనందం.. మనశ్శాంతి. ఈ దేవాలయంలో నిత్యాన్నదానం జరిపించాలని ఆలయ కమిటీ నిశ్చయించింది. దానికి కూడా తగిన సహకారం అందిస్తాం’ అని తెలిపారు విజయ్ తల్లి శోభ. తల్లి కోరిక మేరకు విజయ్ ఆలయం కట్టడంపై పలువురు హర్షం వెలిబుచ్చుతున్నారు.