Tollywood Directors | తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన దర్శకులు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ని కలిశారు. 2024 మే 4న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా.. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు జన్మదినం (మే 4) సందర్భంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న డైరెక్టర్స్ డేని ఈ సారి ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు సంబంధించి ఇప్పటికే అగ్ర హీరోలు అందరికి ఆహ్వానం అందింది. తాజాగా హీరో విక్టరీ వెంకటేష్కు కూడా టీఎఫ్డీఏ ఆహ్వానం అందించింది. వారి ఆహ్వానాన్ని స్వీకరించిన వెంకటేష్ తప్పకుండా ఈవెంట్కు హాజరవుతానని హామీనిచ్చారు. సాయి రాజేశ్, శైలెష్ కోలనుతో పాటు పలువురు దర్శకులు వెంకటేష్ని కలిసిన వారిలో ఉన్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
మరోవైపు ఇప్పటికే ఈ ఈవెంట్కు సంబంధించి అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవితో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, తదితర స్టార్ హీరోలు ఆహ్వానం అందుకున్నారు. మరోవైపు ఈ ఈవెంట్కు సంబంధించి బుక్ మై షో లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైనట్లు టీఎఫ్డీఏ ప్రకటించింది.
Members of #TFDA Met VICTORY @venkymama Garu personally and Invited him for the “Directors’ Day” Event on May 4th at #LBStadium
Book your tickets now on @bookmyshow – https://t.co/Dm30wW73Bp pic.twitter.com/YgZ5bMBMdb
— Vamsi Kaka (@vamsikaka) April 30, 2024