హైదరాబాద్: తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (TFCC) ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్లోని ఫిల్మ్చాంబర్లో మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. నాలుగు సెక్టార్ల నుంచి సుమారు 1600 మంది సభ్యులు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అధ్యక్ష బరిలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సీ.కల్యాణ్ ఉన్నారు. వీరిలో విజేతలెవరో సాయంత్రం 6 గంటలకు తేలనుంది.
ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో నిర్మాతల సెక్టార్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియో సెక్టార్ అనే నాలుగు విభాగాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 1600 మంది సభ్యులు ఉన్నారు. అయితే 900 మంది మాత్రమే ఓటువేయనున్నట్లు తెలుస్తున్నది. ఉదయం 9 గంటల వరకు 104 ఓట్లు పోలయ్యాయి. నటుడు పోసాని కృష్ణ మురళి, నిర్మాత సుప్రియ, దర్శక నిర్మాత గుణశేఖర్ తదితరులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.