సినీ నటి మీనాక్షిచౌదరి గురువారం గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ పార్క్లో మొక్కలు నాటింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ప్రకృతి పరిరక్షణే ధ్యేయంగా గొప్ప సంకల్పంతో ఎంపీ సంతోష్కుమార్ ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. ఇందులో నా వంతు పాత్ర పోషించడం ఆనందంగా ఉంది’ అని చెప్పింది.