నేచురల్ స్టార్ నాని ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. దర్శకులు కూడా కథలు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు నాని. టక్ జగదీష్తో పాటు అంటే సుందరానికి, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు ఈ హీరో. వరస షూటింగ్స్ చేస్తూ కరోనా టైమ్ను కూడా కవర్ చేస్తున్నాడు నాని. అయితే ఈ మూడు సినిమాలపరంగా ఒక్క విషయంలో నాని చాలా క్లారిటీగా ఉన్నాడు. అదేంటంటే ఓటీటీలో మాత్రం సినిమాలను రిలీజ్ చేయకుండా ఉండటం.
అసలు తెలుగులో పెద్ద సినిమాలు కూడా థియేటర్స్ కాకుండా ఓటీటీలో విడుదల చేయొచ్చని చూపించిందే నాని. ఈయన నటించిన 25వ సినిమా వి నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదలైంది. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాలతో వచ్చి దారుణంగా నిరాశ పరిచింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం 2020 సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. వ్యూస్ పరంగా ఓకే అనిపించినా కూడా ఆ తర్వాత మాత్రం చతికిలపడింది వి. దాంతో ఓటీటీ రిలీజ్ అనే మాట వింటేనే భయపడుతున్నాడు నాని.
నాని నటించిన టక్ జగదీష్ సినిమాను ఓటీటీలోనే విడుదల చేయాలనే ఆలోచన నిర్మాతలు చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. దీనిపై కథనాలు కూడా బయటికి వచ్చాయి. అయితే వెంటనే నాని మాత్రం నో చెప్పాడు. తన సినిమాలను థియేటర్స్లో తప్ప.. ఓటీటీలో విడుదల చేసే ముచ్చటే లేదని క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పుడే కాదు తన సినిమాలు ఫ్యూచర్ లో కూడా ఓటీటీలో విడుదల చేయకూడదని ఫిక్స్ అయిపోయాడు నేచురల్ స్టార్. ఎన్ని రోజులైనా థియేటర్స్ కోసం వేచి చూడొచ్చు కానీ డిజిటల్ రిలీజ్ మాత్రం వద్దంటున్నాడు ఈ హీరో. వి ఇచ్చిన షాక్ అలా ఉంది మరి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Narappa Review : రొటీన్ రీమేక్..
పోర్న్ మూవీస్ కేసు.. జ్యుడీషియల్ కస్టడీకి రాజ్ కుంద్రా
చాయ్ బిస్కెట్ కుర్రాడు బిజీ అవుతున్నాడుగా..!
భారీగా ఆస్తులు పోగేసుకున్న రష్మిక..ఎంతో తెలిస్తే షాకవుతారు
‘బంగార్రాజు’కు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఎంతంటే..?