న్యూఢిల్లీ: అశ్లీల చిత్రాలను రూపొందించాడన్న కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రాకు కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అతనితోపాటు రియాన్ థార్ప్ అనే మరో వ్యక్తికి కూడా కస్టడీ విధించింది ఎస్ప్లనాడె కోర్టు. అంతకుముందు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోర్నోగ్రఫిక్ చిత్రాలను రూపొందించి వాటిని కొన్ని యాప్స్ ద్వారా అప్లోడ్ చేసేవారని రాజ్ కుంద్రాపై ఆరోపణలు ఉన్నాయి. పోర్నోగ్రఫిక్ చిత్రాలను రూపొందిస్తున్నారన్న ఫిర్యాదుపై గత ఫిబ్రవరిలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ కేసు విషయంలోనే రాజ్కుంద్రాను సోమవారం అరెస్ట్ చేశామని ముంబై సీపీ ఒక ప్రకటనలో వెల్లడించారు.