సినిమా ఇండస్ట్రీలో ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించడం కష్టం.. చెప్పడం అసాధ్యం. సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసుకునే రవితేజ, విజయ్ సేతుపతి ఈ రోజు స్టార్ హీరోలుగా చక్రం తిప్పుతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలుగా ఉన్నవాళ్లు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. అందుకే సినిమా ఇండస్ట్రీని మాయ ప్రపంచం అంటారు. తాజాగా ఓ కుర్రాడు కూడా సినిమా ఇండస్ట్రీలో ఇలాగే ఎదుగుతున్నాడు. అతడి పేరు సుహాస్.
ఒకప్పుడు చాయ్ బిస్కెట్ అంటూ యూట్యూబ్లో హంగామా చేశాడు. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిలింస్లో నటించాడు. దాదాపు ఏడేళ్లుగా యూట్యూబ్ వీడియోస్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సుహాస్. మజిలీ, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలతో నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటిది ఉన్నట్టుండి కలర్ ఫోటో సినిమాతో హీరో అయిపోయాడు. సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమా గత ఏడాది ఆహాలో విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు.. సుహాస్కు నటుడిగా చాలా మంచి పేరు వచ్చింది. హీరోగా అవకాశాలు కూడా పెరిగాయి. ఇప్పటికే పద్మశ్రీ అనే ఒక సినిమాలో నటిస్తున్నాడు సుహాస్. దాంతో పాటు మరో రెండు సినిమాల్లో హీరో అవకాశాలు వచ్చాయి. తాజాగా ఫ్యామిలీ డ్రామా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమా మా వస్తుంది. మెహర్ తేజ్ దీనికి దర్శకుడు. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. మొత్తానికి ఒకప్పటి యూట్యూబ్ కుర్రాడు.. ఇప్పుడు మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Narappa Review : రొటీన్ రీమేక్..
పోర్న్ మూవీస్ కేసు.. జ్యుడీషియల్ కస్టడీకి రాజ్ కుంద్రా
లొకేషన్ లో శర్వానంద్, రష్మిక..షూటింగ్ షురూ
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు