OTT | కరోనా కారణంగా కొన్ని నెలలుగా సినిమా ఇండస్ట్రీ అత్యంత దారుణంగా నష్టపోతుంది. కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే గత ఏడాదిన్నర కాలంగా 4000 కోట్ల రూపాయలు నష్టపోయినట్లు తెలుస్తుంది. మరోవైపు థియేటర్స్ ( Theatres ) వ్యవస్థ కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. మరీ ముఖ్యంగా సెకండ్ వేవ్లో లాక్డౌన్ కారణంగా ఎన్నో థియేటర్స్ తాత్కాలికంగా మూసేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. 2021 జూలై 3 నుంచి అక్టోబర్ 30 2021లోపు ఏ తెలుగు నిర్మాత కూడా తన సినిమా డిజిటల్ రైట్స్ OTTలకి అమ్మవద్దని కోరారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు. ఈ మేరకు సెక్రటరీ సునీల్ నారంగ్ ఓ ప్రెస్నోట్ విడుదల చేశారు. వీలైనంత త్వరగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ చేస్తారని.. అందుకే త్వరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని నిర్మాతలను కోరారు.
జూలై అయిపోయిన తర్వాత ఆగస్టులో థియేటర్స్ తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయకుండా OTTలో స్ట్రీమింగ్ చేయడం వైపు అడుగులు వేస్తున్నారు. ఇలా చేస్తే థియేటర్ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని వాళ్లు బాధ పడుతున్నారు. థియేటర్ యాజమాన్యం కూడా ఇదే విషయంపై నిర్మాతలను విన్నవించుకుంటుంది. మరోవైపు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కూడా ఇదే అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని థియేటర్ యజమానుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే తమ విజ్ఞప్తిని ఖాతరు చేయని నిర్మాతల పట్ల భవిష్యత్తులో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది తెలంగాణా ఫిల్మ్ చాంబర్. మరి దీనిపై నిర్మాతలు ఏమంటారో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అమీర్ఖాన్ దంపతుల 15 ఏండ్ల వివాహ బంధానికి తెర
ముఖ్యమంత్రి కొడుకుతో ఆగిపోయిన మెహ్రీన్ పెళ్లి
మెహ్రీన్ కౌర్ కంటే ముందు నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న సినీ ప్రముఖులు వీళ్లే
కాజల్ గర్భవతా, ఇందులో నిజమెంత?
చిన్మయి గర్భవతి అంటూ ప్రచారం..క్లారిటీ ఇచ్చిన ఫేమస్ సింగర్
ప్రగ్యాని రౌండప్ చేసిన బిచ్చగాళ్లు