రేపు మధ్యాహ్నం 3 గంటలకు తారకరత్న (Taraka Ratna) అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai reddy) తెలియజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న అకాల మరణం తనను ఎంతగానో బాధించిందని అన్నారు. తారకరత్న సినీ రంగంలో ప్రతీ ఒక్కరితో సత్సంబంధాలు కొనసాగించారని గుర్తు చేసుకున్నారు. తారకరత్న లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక అలేఖ్యరెడ్డి మానసిక ఒత్తిడికి గురైంది. తారకరత్న మరణాన్ని అలేఖ్య జీర్ణించుకోలేకపోతుందన్నారు.
మరోవైపు తారకరత్నకు నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు హైదరాబాద్లోని నివాసానికి తరలివస్తున్నారు. తారకరత్న ఇక లేరన్న వార్తను ఇటు అభిమానులతోపాటు యావత్ సినీ ప్రపంచం జీర్ణించుకోలేకపోతుంది. అభిమానుల సందర్శనార్థం రేపు ఉదయం 7 గంటలకు తారకరత్న పార్థీవ దేహాన్ని ఫిలించాంబర్కు తరలించనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగనుంది.