Tamannah | 2022లో ఓటీటీలో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వేస్టేషన్’. దర్శకుడు సంపత్నంది కథను అందించగా, అశోక్తేజ దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు సీక్వెల్గా ‘ఓదెల2’ పేరుతో ఇప్పుడు మరో సినిమా రానుంది. తమన్నా భాటియా ఇందులో ప్రధానపాత్రధారి. తొలిభాగానికి దర్శకుడైన అశోక్ తేజనే ఈ సినిమాకు కూడా దర్శకుడు. సంపత్నంది టీమ్ వర్క్స్, మధు క్రియేషన్స్ పతాకాలపై డి.మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం కాశీలో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశాన్ని తమన్నాపై మేకర్స్ చిత్రీకరించారు. ‘ఓదెల2’ థ్రిల్లింగ్ కలిగించే కథ అని, సంస్కృతి, సంప్రదాయాలలోపాటు ఓదెల మల్లన్నస్వామి ఓ గ్రామాన్ని దుష్టశక్తులనుంచి ఎలా రక్షించాడనేది ఈ కథలో ఆసక్తికరమైన అంశమని, ఆధ్యాత్మికతతో కూడిన థ్రిల్లర్ సినిమా ఇదని, వీఎఫ్ఎక్స్ సినిమాలో టాప్ క్లాస్గా ఉండబోతున్నాయని మేకర్స్ చెబుతున్నారు. హెబ్బాపటేల్, వశిష్ట ఎన్ సింహా ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్ ఎస్., సంగీతం: రజనీష్ లోక్నాథ్.