ధృవ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘కిరోసిన్’. ఈ చిత్రంలో ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..్ర‘టైలర్ బాగుంది. చిత్ర బృందానికి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రభుత్వంలో చిన్న చిత్రాలకు కావాల్సినంత సహకారం అందిస్తున్నాం’ అన్నారు. ‘మర్డర్ మిస్టరీ కథతో ఈ సినిమాను రూపొందించాం. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది’ అని హీరో దర్శకుడు ధృవ అన్నారు.