Taapsee Pannu | అగ్ర కథానాయిక తాప్సీ రహస్యంగా వివాహం చేసుకున్నట్లు తెలిసింది. డెన్మార్క్కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ఈ భామ గత తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 23న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ జంట వివాహం జరిగిందని మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ పెళ్లికి తాప్సీ స్నేహితురాళ్లు పావేల్ గులాటి, కనికా థిల్లాన్తో పాటు దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ కూడా హాజరైనట్లు తెలిసింది. కనినా థిల్లాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటికి ‘నా ఫ్రెండ్ పెళ్లిలో..’ అనే క్యాప్షన్ను జోడించింది.
దాంతో ఆమె తాప్సీ పెళ్లికే హాజరైందంటూ సోషల్మీడియాలో ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందేనని అభిమానులు అనుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం తన పెళ్లిపై వస్తున్న వార్తలను తాప్సీ ఖండించింది. తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని సున్నితంగా హెచ్చరించింది. ఒకవేళ పెళ్లాడితే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచనని, తొలుత అభిమానులతోనే పంచుకుంటానని చెప్పింది. ఈ నేపథ్యంలో తాప్సీ సీక్రెట్ మ్యారేజ్ న్యూస్ వైరల్ కావడం ఆసక్తిని రేకెత్తిస్తున్నది.