తన యాక్టింగ్తో కోట్లాదిమంది ఫాలోవర్లు, అభిమానులను సంపాదించుకున్నాడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ (Sushanth Singh Rajput). స్టార్ యాక్టర్గా లీడింగ్ పొజిషన్కు చేరుకునే క్రమంలో సుశాంత్ సింగ్ ఆకస్మిక మరణం యావత్ సినీ ప్రపంచాన్ని కలచివేసింది. 2020 జూన్లో ముంబైలోని అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దర్యాప్తు బృందం సుశాంత్ది ప్రాథమికంగా ‘ఆత్మహత్య’గా నిర్దారించగా.. సుశాంత్ది ముమ్మాటికీ హత్యే అని కుటుంబం ఆరోపించింది.
ఈ కేసును ముందుగా ముంబై పోలీసులు దర్యాప్తు చేయగా.. అటు నుంచి కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో , సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేశారు. సుశాంత్ సింగ్ మరణించి రెండేళ్లు దాటిపోతున్నా.. అతడి మరణం మిస్టరీగానే ఉండిపోయింది. అటు ముంబై పోలీసులు కానీ.. ఇటు సీఐడీ బృందం కానీ ఈ కేసును ఎటూ తేల్చలేకపోయారు.
ఆ పోస్ట్ మార్టం రికార్డ్ చేయాల్సింది..కానీ..
సుశాంత్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన (Roopkumar Shah) రూప్కుమార్ షా (అటాప్సీ టీం మెంబర్) చేసిన కామెంట్స్ ఇపుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో రూప్కుమార్ షా మాట్లాడుతూ.. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, హత్య గావించబడ్డాడని చెప్పాడు. సుశాంత్ దేహం, మెడపై పలు గాయాలున్నట్టు గుర్తించానన్నాడు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయినపుడు కూపర్ ఆస్పత్రికి పోస్ట్మార్టం కోసం ఐదు మృతదేహాలు వచ్చాయి. ఈ ఐదింటిలో ఒకటి వీఐపీ బాడీ.
మేం పోస్ట్మార్టం చేసేందుకు వెళ్లినపుడు సుశాంత్ శరీరంపై కొన్ని గుర్తులుండగా.. మెడపై కూడా రెండుమూడు గుర్తులు కనిపించాయి. ఆ పోస్ట్ మార్టం రికార్డ్ చేయాల్సింది.. కానీ ఉన్నతాధికారులు మాత్రం కేవలం డెడ్బాడీ ఫొటోలు మాత్రమే తీయాలన్నారు. వారి ఆదేశాల మేరకు అలాగే చేశామన్నాడు.
సుశాంత్ సింగ్ది హత్యే అని చెప్పా..
నేను ఉన్నతాధికారులకు సుశాంత్ సింగ్ది హత్య అని కూడా చెప్పాను. నిబంధనల ప్రకారం పనిచేయాలని వారిని అడిగాను. సుశాంత్ డెడ్బాడీ చూసిన మొదటిసారి వెంటనే ఇది ఆత్మహత్య కాదు హత్య అని నా సీనియర్లకు చెప్పా. మనం రూల్స్ ప్రకారం పనిచేయాలని కూడా చెప్పా. కానీ వీలైనంత త్వరగా డెడ్బాడీ ఫొటోలు తీసి పోలీసులకు అప్పగించాలని నాకు చెప్పారు. అందుకే కేవలం రాత్రి పోస్ట్ మార్టం చేశామని చెప్పుకొచ్చాడు రూప్కుమార్ షా. మరి రూప్కుమార్ షా తాజా సంచలన కామెంట్స్ తో కేసు ఎటువైపు తిరుగుతుందనేది చూడాలి.