కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. దేశంలో రోజుకు వేల మంది పొట్టన పెట్టకుంటుండగా, ఇందులో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు ఇద్దరు లేదా ముగ్గురు ప్రతి రోజు చనిపోతున్నారు. రీసెంట్గా కన్నడ సీనియర్ నటుడు సురేష్ చంద్ర కరోనాతో కన్నుమూశారు. బెంగుళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
కరోనాతో గత వారం రోజుల నుండి చికిత్స పొందుతున్నాడు సురేష్ చంద్ర. కాని పరిస్థితి విషమించడంతో కన్నుమూసారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేష్ నటించిన చెలువినా చిత్తారా, ఉగ్రమ్ సినిమాలోని పాత్రలు ఎప్పటికీ గుర్తుంటాయి. కిచా హుచ్చా, రానా, షైలూ, కాళిదాస కన్నడ మేష్త్రు, అప్పయ్య, జంగ్లీ వంటి పలు హిట్ చిత్రాలలో కూడా నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. చివరిసారిగా 2019లో కాళిదాస కన్నడ మేష్త్రు అనే చిత్రంలో కనిపించారు. ఆయన మృతితో కన్నడ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేశారు.