స్టార్ హీరోహీరోయిన్లు సాధారణ వ్యక్తుల్లా ఆటోలో తిరిగితే, అది జనాల కంట పడితే ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాలా? కీర్తి సురేశ్, వరుణ్ధావన్ కలిసి ముంబయ్ వీధుల్లో ఇలాంటి సందడే చేశారు. వీరిద్దరూ కలిసి అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ ‘తేరీ’ సినిమాకు ఇది రీమేక్గా తెలుస్తున్నది.
షూటింగ్ విరామంలో ఈ జంట సరదాగా ఆటో ఎక్కి ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టారు. వారిని గమనించిన జనం ఫొటోల కోసం ఎగబడ్డారు. కీర్తి సురేష్ నటిస్తున్న తొలి హిందీ చిత్రమిదే కావడం విశేషం. ప్రస్తుతం ఈ ఆటో షికారు వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది.