Actress Surabhi | కోలీవుడ్ హీరోయిన్ ఎక్స్ప్రెస్ రాజా ఫేమ్ సురభి పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ విషయాన్ని సురభి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
‘నేను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఫ్లైట్ కంట్రోల్ తప్పింది. అందరం సీట్లలో నుంచి కిందపడిపోయాం. నా గుండె జారిపోయినంత పనైంది. కానీ కొన్ని గంటల తర్వాత పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. నాకైతే మృత్యువు అంచులదాక వెళ్లొచ్చినట్లు అనిపించింది అని సురభి పేర్కొంది. సందీప్ కిషన్ ‘బీరువా’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ శర్వానంద్ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తరువాత అల్లు శిరీష్ తో ‘ఒక్క క్షణం’ సినిమా చేసిన అది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తుంది.