తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సూపర్స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. స్వామివారి ప్రత్యేక పూజల అనంతరం.. రజనీకాంత్ దంపతులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా, రజనీకాంత్ నేడు కడప అమీన్పీర్ దర్గాను దర్శించుకోనున్నారు. ఆయనతోపాటు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా దర్గాకు వెళ్లనున్నారు.