బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం ఐదు వారాలు పూర్తి చేసుకొని ఆరో వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం రోజు నామినేషన్ చాలా హాట్ హాట్ గా నడిచింది. నిప్పులా ఎగసిపడుతున్న అభిప్రాయాలను ‘అగ్నిపరీక్ష’ టాస్క్లో బయటపెట్టాలన్నాడు బిగ్బాస్.దీంతో ఒక్కొక్కరు తమలో దాగి ఉన్న ఫైర్ని బయటకు తీసుకొచ్చారు.దీంతో బిగ్ బాస్ వాతావరణం వేడెక్కింది.
నామినేషన్ ప్రక్రియలో భాగంగా ముందుగా వచ్చిన సన్నీ.. జెస్సీ ప్రవర్తన నచ్చలేదని అతనిని నామినేట్ చేయగా, రవి కొన్ని టాస్కుల్లో వెన్ను నొప్పి అని తప్పించుకోవడం బాగోలేదని అతనిని నామినేట్ చేశాడు. తర్వాత వచ్చిన విశ్వ.. అనీ మాస్టర్, ప్రియాంకలను నామినేట్ చేశాడు. ప్రతీ సారి స్ట్రాంగ్ కంటెస్టెంట్అని చెప్పి నన్ను అనీ మాస్టర్ నామినేట్ చేయడం నాకు నచ్చలేదంటూ విశ్వ చెప్పాడు.ప్రియాంక తనని తప్పుగా అర్ధం చేసుకుంటుందనే రీజన్ చెప్పి ఆమెను నామినేట్ చేశాడు విశ్వ.
శ్వేత.. సిరి, కాజల్ను నామినేట్ చేసింది., టాస్క్లో అగ్రెసివ్ అవ్వకు అని స్టేట్మెంట్ చెప్పిందని, అది తనకు నచ్చలేదు అని సిరిని శ్వేత నామినేట్ చేసింది. కాజల్ తన నామినేషన్ల గురించి ఇతర ఇంటి సభ్యులతో చర్చించిందని అందుకే నామినేట్ చేస్తున్నానని పేర్కొంది. లోబో.. ప్రియాంక, జెస్సీలను నామినేట్ చేశాడు.టాస్కులో నమ్మకం కోల్పోయారు.. నాణెంలను దొంగిలించి కూడా దొంగలించలేదంటూ అబద్దం చెప్పారంటూ నామినేట్ చేశాడు.