బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో శనివారం ఎపిసోడ్ ఎంతో ఎమోషనల్గా సాగింది.నాగార్జున మరి కొంత మంది హౌజ్మేట్స్ని కూడా ఇంటి సభ్యుల ముందుకు తీసుకు వచ్చారు. దీంతో వారందరు ఫుల్ ఎమోషనల్ అయ్యారు. అయితే శనివారం ఎపిసోడ్లో ఎలిమినేషన్ ట్విస్ట్పై కాజల్, సన్నీల మధ్య చర్చ నడిచింది. ఆ ఎవిక్షన్ పాస్ నాకెందుకు ఇచ్చారు మచ్చా.. అది కూడా మా అమ్మతో పంపారు అని కాజల్తో సన్నీ అనగా.. ఖచ్చితంగా ట్విస్ట్ ఉంటుంది అని చెప్పుకొచ్చింది.
ఇక సన్నీ.. ప్రియాంకని కాసేపు ఆట పట్టించాడు. మానస్ గురించి నీ ఒపీనియర్ ఏంటి అని అడిగాడు.. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావ్ అని అంటూనే ఐ లైక్ మానస్ అని అన్నది ప్రియాంక.లైక్ మాత్రమేనా, లవ్ కూడా ఉందా? అని అడగడంతో సిగ్గుపడిపోయింది. ప్రియాంక మనసులో ఏవోవో ఊహించుకుంటుండగా, మానస్ ఆమెకు దూరంగా ఉండాలని ట్రై చేస్తున్నాడు.
ప్రతివారం లాగే ఈవారం కూడా ఇంటి సభ్యులకు కిచిడి టాస్క్ ఇచ్చారు. ప్రెస్టేజ్ కుక్కర్లో కిచిడి ఎవరైతే బాగా చేస్తారో వాళ్లు ప్రెస్టేజ్ కుక్కర్ తరుపున 25 వేల ఓచర్ అందుకుంటారని బిగ్ బాస్ చెప్పారు. ఈ టాస్క్కి జడ్జెస్ గా రవి, శ్రీరామ్ ఉన్నారు. మిగతా వారు రెండు టీమ్లుగా విడిపోయి కిచిడి చేయగా, సన్నీ కాజల్లు కిచిడీ బాగా చేశారని ఇద్దరు జడ్జెస్ తేల్చారు. దీని తర్వాత మరో టాస్క్ కూడా ఇద్వగా ఇందులో శ్రీరామ్, షణ్ముఖ్, ప్రియాంకల టీం గెలిచారు.