న్యూఢిల్లీ : ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ జిమ్ చేస్తూ ఈ నెల 10న గుండెపోటుతో కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వెంటిలెటర్ సపోర్టుతో ప్రాణాలతో పోరాడుతున్నాడని అతని మిత్రుడు, స్టాండప్ ఆర్టిస్ట్ సునీల్ పాల్ తెలిపారు. శ్రీవాస్తవ మెదడు సక్రమంగా పని చేయడం లేదని, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నాడు. శ్రీవాస్తవ కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థించాలని అభిమానులను కోరాడు.
రాజు శ్రీవాస్తవ (58) ఈ నెల 10న ఉదయం 10.45 గంటలకు ఎయిమ్స్ ఎమర్జెన్సీకి తరలించారు. ఆ తర్వాత యాంజియోప్లాస్టీ చేశారు. డాక్టర్ నితీశ్ నాయక్ బృందం చికిత్స అందిస్తున్నది. అయితే, రాజు శ్రీవాస్తవ గతంలోనూ వ్యాయామం చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురైనట్లు అతని కజిన్ అశోక్ తెలిపాడు. 1980 నుంచి చిత్రపరిశ్రమలో కొనసాగుతుండగా.. 2005లో రియాలిటీ స్టాండప్ కామెడీ షో ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్’ మొదటి సీజన్ తర్వాత మంచి గుర్తింపు పొందాడు. రాజు శ్రీవాస్తవ మైనే ప్యార్ కియా, బాజీగర్ చిత్రాల్లోనూ నటించాడు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్గా కొనసాగుతున్నాడు.
#SunilPal gives a health update on #RajuSrivastava pic.twitter.com/mwIwYwKest
— First India Telly (@firstindiatelly) August 18, 2022