శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. మార్చి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 27న హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రముఖ దర్శకుడు సుకుమార్, అగ్ర కథానాయికలు కీర్తి సురేష్, సాయిపల్లవి హాజరుకానున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయని, సకుటుంబ కథా చిత్రంగా అన్ని వర్గాలను మెప్పిస్తుందని నిర్మాత తెలిపారు. వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్రావత్, గోపరాజు, బెనర్జీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుజిత్సారంగ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటర్: శ్రీకర్ప్రసాద్, సంగీతం:దేవిశ్రీప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, దర్శకత్వం: తిరుమల కిషోర్.