‘పుష్ప’ ఆగమనానికి ముహూర్తం ఖరారైంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ భారీ పాన్ఇండియా చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్లో ప్రేక్షకులముందుకు తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలియజేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘పుష్ప-ది రైజ్’ పేరుతో తొలిభాగం ప్రేక్షకులముందుకు రానుంది. ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా ఇతివృత్తంతో చిత్తూరు నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో పుష్పరాజ్గా అల్లు అర్జున్ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరస్లో కుబా, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, ఆర్ట్: రామకృష్ణ-మోనిక, సాహిత్యం: చంద్రబోస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి, సీఈవో: చెర్రీ, కో ప్రొడ్యూసర్: ముత్తంశెట్టి మీడియా, లైన్ ప్రొడ్యూసర్: కెవీవీ బాలసుబ్రహ్మణ్యం, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సుకుమార్.